కరీంనగర్ జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్ స్థాయిలోనే జిల్లా యువతకు స్కిల్ డెవలప్మెంట్, పోటీ పరీక్షలకు ప్రత్యేక ఉచిత శిక్షణ ఇస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా వెల్లడించారు. రూ.7 కోట్లతో కొత్త లైబ్రరీ భవనం సిద్ధమైందని మేయర్ తెలిపారు.