అనారోగ్యంతో మృతి చెందిన గద్దర్
దక్కన్ (డీసీ) తెలుగు
ప్రజా గాయకుడు, సామాజిక ఉద్యమకారుడు గద్దర్ మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. 1949లో తూఫ్రాన్లో జన్మించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. కాగా తన ఆట పాటలతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. ఆయన రాసిన పాట పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా అనే పాట తెలంగాణ ఉద్యమంలో యువకులను ఊరకలెత్తించింది.
![](https://dctelugu.com/wp-content/uploads/2023/08/Untitled-1.jpg)