Friday , 18 October 2024
Breaking News

తిరుమలలో పట్టుబడ్డమరో చిరుత

బోనుకు చిక్కిందన్న టిటిడి అధికారులు
అలిపిరి కాలినడక మార్గంలో బోనులో మరో చిరుత చిక్కింది. ఏడో మైలు వద్ద ఆదివారం 7 గంటల ప్రాంతంలో చిరుత చిక్కినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. కాగా ఈ చిరుతతో కలిపి మొత్తంగా ఇప్పటివరకు నాలుగు చిరుతలను పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. జూన్‌ 22వ తేదీన 7వ మైల్‌ వద్ద కౌశిక్‌పై దాడి తరువాత చిరుతలను అటవీ అధికారులు బంధిస్తున్నారు. జూన్‌ 23వ తేదీ రాత్రి 7వ మైల్‌కు సవిూపంలోని అటవీ ప్రాంతంలో ఓ చిరుతను అటవీ అధికారులు బంధించారు. ఆగష్టు 11వ తేదీన అలిపిరి కాలిబాట మార్గంలోని నరసింహస్వామి ఆలయానికి సవిూపంలో అరేళ్ళ బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది. బాలికపై దాడి జరిగిన ప్రాంతానికి సవిూపంలోనే ఆగష్టు 14, 17వ తేదీల్లో రెండు చిరుతలు బోన్‌లో చిక్కాయి.
7వ మైల్‌ వద్ద మరో చిరుత సంచరించిస్తున్నట్లు ట్రాప్‌ కెమెరాల ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. చిరుతను బంధించేందుకు 10 రోజులుగా శ్రమించారు. ఎట్టకేలకు ఈరోజు ఉదయం చిరుత బోన్‌లో చిక్కింది. అలాగే నడకమార్గంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు యత్నిస్తున్నారు. 15రోజులుగా ప్రయత్నిస్తున్న ఎలుగుబంటి చిక్కడంలేదు

About Dc Telugu

Check Also

Viral Video

Viral Video”దృఢ సంకల్పమే గెలుపున‌కు దారి తీస్తుంది… వీడియో వైర‌ల్

Viral Video” సంక‌ల్పం గ‌ట్టిద‌యితే సాధించ‌లేనిదంటూ ఏదీ ఉండ‌దు.. దీనిని ప‌లువురు అప్పుడ‌ప్పుడు నిరూపిస్తుంటారు. ఒక‌సారి ఒడితే మ‌రోసారి ప్ర‌య‌త్నించాలి. …

Samsung phone

Samsung phone” అతి త‌క్కువ ధ‌ర‌లో సాంసంగ్ ఆన్‌డ్రాయిడ్ ఫోన్‌..రూ.6499 కే..

Samsung phone” అతి తక్కువ ధ‌ర‌లో సాంసంగ్ ఆన్‌డ్రాయిడ్ ఫోన్ ఆమెజాన్ ఆఫ‌ర్లో అందిస్తోంది. సాంసంగ్ గెలాక్సీ ఎం 05 …

18.10.2024 D.C Telugau Cinema Edition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com