Viraral Videos” మార్నింగ్‌లో ఎద్దు దాడి.. వృద్దుడి మృతి.. కెమెరాల్లో రికార్డు

Viraral Videos"

Viraral Videos” మార్నింగ్ వాక్‌కు వెళ్తున్న వృద్దుడిపై ఎద్దు దాడి చేసింది. ఈ ఘ‌ట‌న‌లో వృద్దుడు అక్క‌డికక్క‌డే మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఈ మ‌ధ్య‌కాలంలో ప‌శువుల దాడులు ఎక్కువైపోయాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని బ‌రేలిలోని సంజ‌య్‌న‌గ‌ర్ కు చెందిన వృద్దుడు కృష్ణానంద్‌పాండే బుధ‌వారం (జ‌న‌వ‌రి 24) న మార్నింగ్ వాక్ కోసం కొంత దూరం వెళ్లాడు. ఈ క్ర‌మంలో ఎదురు ఒక న‌ల్ల‌ని ఎద్దు అతనిపై దాడి చేసింది. బ‌లంగా పొడ‌వ‌డంతో కృష్ణానంద్‌పాండే రోడ్డుపై అక్క‌డే కింద‌ప‌డ్డాడు. ప‌డ్డ‌చోటే క‌ద‌ల‌కుండా ఉండిపోయాడు. అయిన‌ప్పటికీ ఆ ఎద్దు వ‌ద‌ల్లేదు. చాలా సేపు అత‌డిని పొడుస్తూనే ఉంది. కొద్దిసేప‌టి త‌రువాత చుట్టుప‌క్క‌ల వాళ్లు ఎద్దు త‌రిమేశారు. కానీ అప్ప‌టికే కృష్ణానంద్ పాండే మృతి చెందారు. ఈ విష‌య‌మై స్థానిక అధికారుల‌కు ఫిర్యాదు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *