Tenth Class Exams” టెన్త్‌లో నిముషం నిబంధన ఎత్తివేత

Tenth Class Exams

5 నిముషాల ఆలస్యం అయినా అనుమతి
Tenth Class Exams” ప‌దో తరగతి విద్యార్థులకు తెలంగాణ స‌ర్కారు శుభవార్త చెప్పింది. కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిషం నిబంధనను ఎత్తివేసింది. (Tenth Class  Exams) పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు 5 నిమిషాల గ్రేస్‌ ట్రైం ఇచ్చింది.  (Tenth Class  Exams)  పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కాస్త టెన్షన్‌ లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రకటించిన గ్రేస్‌టైమ్‌ కారణంగా విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. కాగా మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి (Tenth Class  Exams)  పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. ఎగ్జామ్‌ సెంటర్ల వద్ద సెల్‌ఫోన్‌లను నిషేధించారు. అలాగే జిరాక్స్‌ సెంటర్లను మూసేస్తారు. 144 సెఓన్‌ అమల్లో ఉంటుంది. గతంలో లీకేజ్‌ అనుభవాల దృష్ట్యా పకడ్బందీ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Tdp Mla Candidates” టిడిపి రెండో జాబితా విడుదల

Brs M.P Candidates” మ‌రో ఇద్ద‌రు ఎంపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీఆర్ ఎస్

Bjp mp candidates second list ” బీజేపీ రెండో ఎంపీ లిస్ట్‌లో తెలంగాణ నుంచి వీరే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *