సిమ్లా ః శివాలయం కూలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందిన ఘటన హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో బుధవారం చోటు చేసుకుంది. సిమ్లా జిల్లాలోని సమ్మర్ హిల్ ప్రాంతంలోని ఆలయం కొట్టుకుపోవడంతో ఈ ప్రమాదంలో ఓ కుటుంబానికి చెందిన మూడు తరాల సభ్యులు మృత్యవాత పడడం విషాదం నింపింది. ఆలయం కూలినప్పుడు ముగ్గురు పిల్లలు తో పాటు ఆ కుటుంబానికి చెందిన ఏడుగురు గుడిలో ఉన్నారు. పవన్ శర్మ ఆయన భార్య సంతోషి కుమారుడు అమన్, కోడలు అర్చన, ముగ్గురు మనవరాళ్లు మృతుల్లో ఉన్నట్టు గుర్తించారు. ప్రమాదం తర్వాత ఐదుగురు కుటుంబసభ్యుల మృతదేహాలను గుర్తించారు. ఇదే కుటుంబానికి చెందిన ఇద్దరితో పాటు మరో ఇద్దరి ఆచూకీ ఇంకా లభించలేదు. తమ కుటుంబసభ్యుల మృతదేహాలు గుర్తించి తమకు అప్పగించాలని ఎదురుచూస్తున్నామని బాధిత కుటుంబానికి సవిూప బంధువు సునీత శర్మ కోరారు.
Check Also
Sony Smart TV” స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్… ఇప్పుడే కొనండి..
Sony Smart TV” సోనీ బ్రావియా 2 సిరీస్ 108 సెం.మీ (43 అంగుళాలు) 4K అల్ట్రా HD స్మార్ట్ …
Kurnool DCCB” కర్నూలు డీసీసీబీ (DCCB) స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్
Kurnool DCCB” కర్నూలులోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్. (DCCB), స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్ ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ …