శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గుట్టపై వెలసిన కలియుగ దైవం, దశావతారాల్లో మొదటిదైన శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పౌర్ణమి జాతరను పురస్కరించుకుని ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.