మాజాన్ని చైతన్య పరచడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని మల్కాజిగిరి కమిషనరేట్ ఉప్పల్ జోన్ డిసిపి కే. సురేష్ కుమార్ పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం పోలీసులతో పాటి జర్నలిస్టులు కూడా తమ వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారని అన్నారు.
ప్రతిష్టాత్మకమైన ఉప్పల్ ప్రెస్క్లబ్కు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ నూతన అధ్యక్షుడిగా వేముల తిరుపతిరెడ్డి ఎన్నికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా పి. సాగర్, ప్రధాన కార్యదర్శిగా గ్యారంపల్లి శివాజీ బాధ్యతలు చేపట్టనున్నారు.