తేదీ: మే 30, 2025
ప్రాంతం: శంకరపట్నం, కరీంనగర్ జిల్లా
రిపోర్ట్: డిసి ప్రతినిధి
తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు శనిగరపు యువరాజ్ ఆధ్వర్యంలో ఆర్డీవో వెంకటేశ్వర్లుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
వీటిలో ముఖ్యమైన హామీలు:
-
ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల స్థలం
-
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం
-
నెలకు ₹30,000 గౌరవ వేతనం
-
50% సబ్సిడీతో రుణాలు
-
గుర్తింపు కార్డు
-
₹20 లక్షల ప్రమాద బీమా
ఈ హామీలను వెంటనే అమలు చేయాలని, తెలంగాణ ఉద్యమకారుల జీవితాల్లో గౌరవం, భద్రత కల్పించాలని యువరాజ్ డిమాండ్ చేశారు.
ఆర్డీవో స్పందన సానుకూలం
వినతిపత్రాన్ని స్వీకరించిన ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఈ విషయాన్ని శాఖపరంగా సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిస్తామనన్నారని యువరాజ్ తెలిపారు. ఉద్యమకారులకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చినట్టు యువరాజ్ చెప్పారు. ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ఆయనను జేఏసీ నేతలు అభినందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ భోగ పద్మ, ఇతర జిల్లా, మండల స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వీరు ఉద్యమకారుల హక్కుల కోసం ప్రభుత్వం ముందు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇటువంటి చిన్న చిన్న ప్రకటనల కోసం సంప్రదించండి.. tholivartha1@gmail.com మెయిల్ చేయండి.. కేవలం 300 రూపాయలకే మీ యాడ్స్ వేయబడును
https://shorturl.fm/fSv4z