Matsyagirindra swamy alaya chairman” శంకరపట్నం, జూన్ 2 డిసీ ప్రతినిధి :
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలోని శ్రీ మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్గా కొరెం రాజిరెడ్డి నియమితులయ్యారు. ఈ విషయాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేవాదాయ శాఖ నియమాక ప్రక్రియలో భాగంగా కొత్తగట్టు గ్రామానికి చెందిన కోరెం రాజిరెడ్డికి నియామక పత్రం అందించామని పేర్కొన్నారు. భక్తుల కోర్కెలను తీర్చే ఆలయ అభివృద్ధికి ధర్మకర్తల మండలి క్రియాశీలంగా పనిచేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
-
బత్తిని శ్రీనివాస్ గౌడ్ (మాజీ జెడ్పిటిసి, టిపిసిసి సభ్యుడు)
-
గోపిగోని బసవయ్య గౌడ్ (కాంగ్రెస్ మండల అధ్యక్షుడు)
-
ఆడెపు అజయ్ (యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు)
-
మహమ్మద్ షారుక్ (యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు)
-
ఉప్పుగళ్ల మల్లారెడ్డి (ప్రస్తుత ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్)
-
ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు
- OnePlus 13S” భారత మార్కెట్లోకి వన్ ప్లస్ 13S: కొత్త AI శకం ఆరంభం!
