Liquor price” తెలంగాణలో మద్యం ధరలు పెంపు – కొత్త రేట్లు మే 19 నుంచి

Liquor price”  తెలంగాణలో మద్యం ప్రేమికులకు తాజాగా ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. బీర్ల ధరలు ఇటీవలే పెరిగిన నేపథ్యంలో, ఇప్పుడు విస్కీ, బ్రాందీ తదితర మద్యం రకాలపై కూడా ప్రభుత్వం ధరలను సవరించింది.

తాజాగా విడుదలైన ఎక్సైజ్ శాఖ సర్క్యూలర్ ప్రకారం:

క్వార్టర్ బాటిల్పై రూ.10

ఆఫ్ బాటిల్పై రూ.20

ఫుల్ బాటిల్పై రూ.40 పెంపు జరిగింది.

ఈ సవరణలు మే 19 నుండి అమలులోకి రానున్నాయి. అయితే, తక్కువ ధరల మద్యం (చీప్ లిక్కర్) ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవని అధికారికంగా వెల్లడించారు.

ఇదే తరుణంలో, గత ఫిబ్రవరిలో బీర్ ధరలు 15% వరకు పెంచబడ్డాయి. ఈ పెంపు ఎక్సైజ్ శాఖకు సమర్పించిన త్రిసభ్య కమిటీ (జడ్జి జైస్వాల్ నేతృత్వంలో) నివేదిక ఆధారంగా అమలైంది.

మద్యం అమ్మకాల పరంగా కూడా రాష్ట్రానికి భారీ ఆదాయం లభిస్తోంది. ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం, కేవలం గత నెలలోనే రూ.3,272 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వ ఖాతాలోకి చేరింది. గత ఏడాదితో పోలిస్తే బీర్ అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు శాఖ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *