తిరుపత్తూరు: ఓ వాహనం ఆగిఉన్న మినీ బస్సును ఢకొీట్టడం ఆ మినీ బస్సు రోడ్ డివైడర్ పైన కూర్చున్న వారిపైకి వెళ్లడంతో ఏడుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లా నాట్రంపల్లి సమీపాన సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స కోసం తిరుపత్తూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా..? లేక ఎవరైనా కావాలనే చేశారా..? అనే యాంగిల్ లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Check Also
Mee Seva” తెలంగాణా మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా చల్ల కృష్ణ నియామకం
Mee Seva” హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో నియామకం కరీంనగర్ అక్టోబర్ 17 తెలంగాణా రాష్ట్ర …