Friday , 17 January 2025
Breaking News

600 కిలోల అయోధ్య రామాలయ గంట

అష్టధాతువులతో తమిళనాడులో తయారీ
ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రం అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీ రామ మందిర గర్భగుడి నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. భవ్య రామమందిరం తుది మెరుగులు దిద్దుకుంటోంది. జనవరి 22న ఐదేళ్ల బాలుడి రూపంలో శ్రీరాముడు ఆలయంలో కొలువుదీరనున్నాడు. రాముడి విగ్రహానికి ఎన్ని విశిష్టతలున్నాయో.. అక్కడ ఏర్పాటు చేయబోయే గంటకూ అన్నే విశేషాలున్నాయి. దీనిని తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేయించారు. అష్టధాతువుతో తయారు చేసిన ఈ గంట రామ మందిరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 600 కిలోలకు పైగా బరువున్న దీనిని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ 2020 నుంచే తయారు చేయడం ప్రారంభించారు. రామమందిర ప్రారంభోత్సవం దగ్గర పడుతుండడంతో తమిళనాడు నుంచి అయోధ్యకు తరలించారు. గంటపై జై శ్రీరామ్‌ అని రాసి ఉంది. దీనిని ప్రస్తుతం ఆయోధ్య రామమందిర ప్రాంగణంలో భక్తుల సందర్శనార్ధం ఉంచారు. ఇక జనవరిలో జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రస్తుతం రామ్‌లల్లా విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. కాశీ పండితులు అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

 

టార్గెట్ లోక్ స‌భ‌… బండికి ప‌గ్గాలు అప్ప‌జెప్పుతారా..?

మాయావతిని పీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కూటమిలో చేరుతాం

కరెంట్‌ బిల్లులు కట్టొద్దు : ఎమ్మెల్సీ కవిత

About Dc Telugu

Check Also

One Plus

One Plus Phones”వ‌న్‌ప్ల‌స్ 13 ఆర్ ఏఐతో స్మార్ట్ ఫోన్‌..

One Plus Phones” వ‌న్‌ప్ల‌స్ (OnePlus) 13R | వ‌న్‌ప్ల‌స్ (OnePlus) ఏఐ(AI) తో మరింత స్మార్ట్ (12GB రామ్‌(RaM), …

DCCB

DCCB” శ్రీకాకుళం డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్

శ్రీకాకుళం డీసీసీబీ(DCCB) అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్ 2025 శ్రీకాకుళంలోని (Srikakulam)డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (DCCB), …

16.01.2025 D.C Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com