group-1-notification” గ్రూప్-1 నోటిఫికేషన్ ను సోమవారం నాడు టీఎస్ పీఎస్సీ విడుదల చేసింది. 2022 ఏప్రిల్ నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసిన కొద్ది సేపటికే నూతన నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. 563 గ్రూప్-1 పోస్టులకు గాను నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ జారీ చేసింది. ఈ నెల (ఫిబ్రవరి) 23 నుండి మార్చి 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష మే లేదా జూన్ లో మెయిన్స్ ఎగ్జామ్స్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ ఉంటాయని పేర్కొన్నారు.
563 పోస్టులతో గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్
