Matsya girindra Swamy” శంకరపట్నం డిసిప్రతినిధి
శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోరెం రాజిరెడ్డిను శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్గా రాష్ట్ర దేవాదాయ శాఖ నియమించింది.
ఈ సందర్భంగా మంగళవారం యువ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆడెపు అజయ్ ఆధ్వర్యంలో పలువురు యువకులు రాజిరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.
OnePlus 13S” భారత మార్కెట్లోకి వన్ ప్లస్ 13S: కొత్త AI శకం ఆరంభం!
ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ, “పార్టీలో అనేక సంవత్సరాలుగా కృషిచేసిన రాజిరెడ్డి గారు చైర్మన్గా నియమించబడటం యువ నాయకులకు ప్రేరణగా నిలుస్తోంది. ఆయన నియామకం పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్నిస్తుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువ నాయకులు కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని బలపరచాలి,” అని అన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ నాయకులు అనిల్, మిగతా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
iQOONeo10″ ఐక్యూ నియో 10 విడుదల – 144FPS గేమింగ్, 7000mAh బ్యాటరీతో మార్కెట్లో సంచలనం!

