Karimnagar news” తెలంగాణ మున్నూరుకాపు జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో అభినందన సభ
తెలంగాణ మున్నూరుకాపు రాష్ట్ర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా చల్లా హరిశంకర్ పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా, ఆయనకు మున్నూరుకాపు జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ప్రత్యేక సత్కారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బుధవారం రోజున ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫోరం జిల్లా నేతలు వేళ్పుల శ్రీనివాస్ పటేల్, సూదుల వెంకటరమణ పటేల్ మాట్లాడుతూ,
“సంఘానికి హరిశంకర్ పటేల్ చేస్తున్న కృషి అభినందనీయమైనది. ఆయన నాయకత్వం మున్నూరుకాపు సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని వ్యాఖ్యానించారు.
హరిశంకర్ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరుకాపు సంఘాన్ని చైతన్యవంతం చేసే యాత్రలు అవసరమని, సమాజాన్ని ఐక్యంగా మలచేందుకు కృషి అవసరమని అభిప్రాయపడ్డారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ పటేల్ మాట్లాడుతూ:
“ఈ సత్కారం నా బాధ్యతను మరింత పెంచింది. సమాజం ఐక్యత కోసం నిష్టగా పనిచేస్తాను. జర్నలిస్టుల నుండి వచ్చిన ఈ అభినందనలు నాకు మరింత ప్రేరణగా నిలుస్తాయి” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫోరం గౌరవ అధ్యక్షుడు బోనాల తిరుమల పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏబూసి శ్రీనివాస్ పటేల్, టియుడబ్ల్యూజె అధ్యక్షుడు శ్రీనివాస్ పటేల్, బోనాల వెంకటేష్ పటేల్, రఘు పటేల్, సుగుణాకర్ పటేల్, మడిపల్లి శ్రీనివాస్ పటేల్, మంద శ్రీనివాస్ పటేల్, హరికృష్ణ పటేల్, చల్ల కృష్ణ పటేల్, సుమ పటేల్, మధు పటేల్ సహా అనేక మంది పాల్గొన్నారు.
పలువురు సీనియర్ జర్నలిస్టులు, సంఘ నాయకులు మరియు మేధావులు ఈ కార్యక్రమాన్ని గౌరవప్రదంగా తీర్చిదిద్దారు.
