ఎన్ని చట్టాలు తెచ్చినా..ఎన్ని అవగాహన సదస్సు పెట్టినా కొంతమంది దుర్మార్గులు మాత్రం మారడం లేదు. మూడో సారి ఆడపిల్ల పుట్టిందని పసికందు నోట్లో పొగాకు కుక్కి తండ్రి చంపిన ఘటన మహారాష్ట్ర లోని జల్గావ్ జిల్లాలో చోటు చేసుకుంది. పహూర్ పోలీస్ స్టేషన్ కు పరిధిలోని హరినగర్ తండాకు చెందిన గోకుల్ యాదవ్ (30) ఇది వరకే ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఈ క్రమంలో తన భార్యకు మూడో కాన్పులో ఆడపిల్ల జన్మించడంతో కోపోద్రిక్తుడయ్యాడు. కుమారుడు పుట్టలేదన కోపం కట్టలు తెంచుకుంది. కన్న తండ్రి మమకారాన్ని మరిచిపోయి కసాయిలా ప్రవర్తించాడు. పసికందు నోట్లో పొగాకు కుక్కి ఆయువు తీశాడు. తరువాత మృతదేహానికి ఎవరికీ తెలియకుండా అంత్య క్రియలు చేశాడు. ఆ గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త శిశువు జనాన్ని నమోదు చేసుకునేందుకు గోకుల్ నివాసానికి వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Check Also
Mumbai Local Train” కదులుతున్న ట్రయిన్నుంచి కిందపడిన వ్యక్తి… వీడియో
Mumbai Local Train” గమ్య స్థానం చేరుకునేందుకు రద్దీగా ఉన్నలోకల్ రైళ్లో వెళ్తున్న ఓ వ్యక్తి కిందపడిన భయాకన ఘటన …
atal setu”15 సెకన్లలోనే ఆత్మహత్య .. సీసీవీడియో
atal setu” చావడానికి చాలా ధైర్యం కావాలంటారు కానీ ఇప్పుడు చిన్నా పెద్దా తేడాలేకుండా క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. సమస్య …
Bus Accident” అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది
Bus Accident” ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్లీ (టి) …