Wednesday , 30 April 2025

Pakistan” యుద్ద భ‌యం.. క‌వ్వింపు చ‌ర్య‌లు… సైనికుల రాజీనామా..

Pakistan” పాకిస్తాన్ ఎప్పుడు వ‌క్ర‌బుద్దే చూపిస్తుంటుంది. ప‌హ‌గాల్గ‌మ్ దాడి త‌ర్వాత భార‌త్ సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఆ దాడితో మాకు సంబంధం లేదంటూనే పాకిస్తాన్ యుద్దానికి కాలు దువ్వుతోంది. రోజుకో మంత్రి రోజుకో ర‌కంగా ప్ర‌క‌టిస్తున్నారు. ఉగ్రవాదాన్ని తామే పెంచి పోషించామ‌ని ఒక‌రు అంటే.. మా ద‌గ్గ‌ర అణుబాంబులున్నాయి యుద్దం వ‌స్తే అవి భార‌త్ వైపే గురిపెడుతామ‌ని మ‌రొక‌రు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి ఫైల్స్ కార‌ణంగా హాస్ప‌ట‌ల్ జాయిన్‌అయ్యాడ‌ని స‌మాచారం. అలాగే అక్క‌డి ఆర్మీ చీఫ్ క‌న‌బ‌డ‌ట్లేదు దేశం విడిచి పారిపోయాడ‌ని కూడా విన‌బ‌డుతోంది. మ‌రోవైపు పాక్ ఆర్మీలోని సైనికులు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. రెండు రోజుల క్రితం 1450 మంది రాజీనామా చేశార‌ని వార్త‌లొచ్చాయి. తాజాగా ఈ సంఖ్య 5 వేల‌కు చేరిందంటున్నారు. ఈ త‌రుణంలో పాకిస్తాన్ స‌మాచార శాఖ మంత్రి అతుల్లా తరార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే 24 గంట‌ల నుంచి 36 గంట‌ల్లో భార‌త్ త‌మ‌పై దాడిచేస్తుంద‌ని ఎక్స్ వేదిక‌గా పేర్కొన్నారు. పాకిస్తాన్‌పై సైనిక చ‌ర్య‌కు ప్ర‌ణాళిక రూపొందించింద‌ని ట్వీట్ చేశారు. పాకిస్తాన్‌లో అంత‌ర్గ‌త స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయి.. ఇక‌ బ‌లూచిస్తాన్ ప్ర‌త్యేక దేశంగా ప్ర‌క‌టించాల‌నే డిమాండ్ ఊపందుకుంది. సింధూ రాష్ట్రంలో న‌దీ జలాల కోసం తిరుగుబాటు చేస్తున్నారు. నిత్యావ‌స‌ర ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి.

 

About Dc Telugu

Check Also

అంత‌రిక్షంలో ప‌లు ప‌రిశోధ‌న‌ల కోసం వెళ్లిన వ్యోమ‌గాముల‌కు ఆహారం అందించేందుకు ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. దీనిపై ఫ్రెంచ్ సైంటిస్టులు దృష్టి సారించారు. …

China” పాకిస్తాన్‌కు చైనా మ‌ద్ద‌తు.. చైనాది పాత పాటే..

China”  ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడుల త‌ర్వాత భారత్ పాకిస్తాన్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. తాము ఉగ్ర‌దాడి చేయ‌లేదంటూనే యుద్దానికి సిద్ద‌మ‌ని …

Local news ” ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి…

Local news ”  శ్రీ భూ నీలా సమేత మత్స్య గిరింద్ర స్వామి.. ఆలయ అభివృద్ధి కోసం విరాళాల సేకరణ… …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com