Railway” తత్కాల్ బుక్ చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి.

Railway” రైల్వే శాఖ కీలక మార్పులు తీసుకువస్తోంది. జూలై 1వ తేదీ అర్ధరాత్రి నుంచి కొత్త టికెట్ ధరలు అమలులోకి వస్తాయని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని జోన్‌లకు సర్క్యులర్‌ జారీ అయింది.

తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం ఇకపై ఆధార్ తప్పనిసరిగా ఉండనుంది. ఈ కొత్త నిబంధన జూలై 1 నుంచి అమలులోకి రానుంది.

పెరిగిన ఛార్జీలు ఇలా ఉన్నాయి:

సెకండ్‌ క్లాస్‌ ఆర్డినరీ టికెట్లు:

0–500 కి.మీ వరకు ఛార్జీల్లో మార్పు లేదు.

501–1500 కి.మీ వరకు టికెట్‌దరపై ₹5 పెంపు.

1501–2500 కి.మీ వరకు ₹10 పెంపు.

2501–3000 కి.మీ వరకు ₹15 పెంపు.

ఆర్డినరీ స్లీపర్‌/ఫస్ట్‌ క్లాస్‌ టికెట్లు:

కి.మీకు 0.5 పైసల చొప్పున పెంపు.

నాన్‌-ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు:

నాన్‌-ఏసీ ఫస్ట్‌, సెకండ్‌, స్లీపర్‌ క్లాస్‌ టికెట్లపై కి.మీకి 1 పైసా చొప్పున పెంపు.

ఏసీ రైళ్లకు:

అన్ని తరగతులపై కి.మీకు 2 పైసల చొప్పున ఛార్జీలు పెరుగుతాయి.

అయితే, రిజర్వేషన్ ఛార్జీలు మరియు సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్‌లలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే బుకింగ్ చేసిన టికెట్లపై పెరిగిన ఛార్జీలు వర్తించవని రైల్వే శాఖ తెలిపింది.

 

Donald trump” ఇద్ద‌రు దోస్తుల మ‌ధ్య కీచులాట‌.. ఒక‌రు ప్ర‌పంచానికి పెద్ద‌న్న‌, ఇంకొక‌రు ప్ర‌పంచ ధ‌న‌వంతుడు

Sugar mill” భారీ వ‌ర్షం.. 2 ల‌క్ష‌ల క్వింటాళ్ల చ‌క్కెర కరిగిపోయింది..

Smartwatch” అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్టైలిష్ స్మార్ట్‌వాచ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *