Medaram Sammakka” ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారలమ్మ తాడ్వాయి మండలం మేడారం లో విషాదం చోటుచేసుకుంది. సమ్మక్క తల్లి పూజారి సిద్దబోయిన దశరథం అనారోగ్య కారణాలతో మంగళవారంమ రణించారు. కొద్ది రోజుల క్రితం దశరథం అన్న సిద్ధబోయిన లక్ష్మణ్రావు సైతం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. స్వల్ప వ్యవధిలోనే అన్నదమ్ముల మృతి మేడారం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. దశరథం మృతిపట్ల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. స్వల్ప వ్యవధిలోనే సోదరులిద్దరు మృతి చెందడం బాధాకరమన్నారు.
![Medaram sammakka](https://dctelugu.com/wp-content/uploads/2024/02/medaram-sammakka.jpg)