✍️ రిపోర్టర్:
డిసి ప్రతినిధి – శంకరపట్నం
ప్రచురణ తేదీ: మే 28, 2025
శంకరపట్నం, మే 28:
పత్రికా రంగానికి విశిష్ట సేవలందించిన సీనియర్ జర్నలిస్టు, గోల్కొండ పత్రిక మాజీ సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి గారి 129వ జయంతి శంకరపట్నం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని శంకరపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోరం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాపరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసిల్దార్ సురేఖ, టీపీసీసీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస గౌడ్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, పాత్రికేయులు హాజరై తమ సంఘీభావం తెలిపారు.
టీపీసీసీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ –
“సురవరం ప్రతాపరెడ్డి నాటి కాలంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచారు. నైజాం పాలనలో కూడా ఆయన వ్రాసిన వార్తలకి గుర్తింపు ఉంది. నేటితరం జర్నలిస్టులు ఆయనను ఆదర్శంగా తీసుకొని నిజాయితీ, నిబద్ధతతో ముందుకెళ్లాలి” అని సూచించారు.
పత్రికా స్వాతంత్య్రానికి నిలువెత్తు ప్రతీక
జర్నలిస్టు వృత్తికి పౌరాణిక విలువలు నాటిన ప్రతాపరెడ్డి గారు ప్రజాస్వామ్యానికి బలమైన మద్దతుగా నిలిచారని పలువురు వ్యాఖ్యానించారు. ఆయన అనుసరించిన విలువలు, ప్రజల పక్షపాతి ధోరణి నేటితరం పాత్రికేయులకు మార్గదర్శకంగా నిలుస్తాయని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
హాజరైన ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:
-
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బసవయ్య గౌడ్
-
జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి గౌడ్
-
బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు మహిపాల్
-
ఏఎస్ఐ సుధాకర్
-
మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం చైర్మన్ ఉప్పుగల మల్లారెడ్డి
-
మాజీ ప్రజాప్రతినిధులు మోత్కూరి సమ్మయ్య, రాములు, తిరుపతి
-
జర్నలిస్టులు కొరిమి వెంకటస్వామి, దేవునూరి రవీందర్, బూర్ల వెంకటేష్, నేరెళ్ల సంతోష్, తాళ్లపల్లి సాగర్, ఎల్కపల్లి సుధీర్ తదితరులు.
అలాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విభిన్న శాఖల అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వీట్లు, పండ్ల పంపిణీ జరిగింది.
✍️ రిపోర్టర్:
డిసి ప్రతినిధి – శంకరపట్నం
ప్రచురణ తేదీ: మే 28, 2025
