మంజీర నదిలోకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూర్లో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ట్రాక్టర్ నదిలోకి వెళ్లడాన్ని చూసిన స్థానికులు పోలీసులకు చెప్పారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. చనిపోయిన వారిని గోపాల్ (30), రమణ (45) మల్లేశ్(30) గా పోలీసులు గుర్తించారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్ల్యక్షంగా నడపడంతోనే ఈ |ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Check Also
Mee Seva” తెలంగాణా మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా చల్ల కృష్ణ నియామకం
Mee Seva” హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో నియామకం కరీంనగర్ అక్టోబర్ 17 తెలంగాణా రాష్ట్ర …