Tahsildar” అంబేద్కర్ కలలుగన్న కుల రహిత సమాజాన్ని నిర్మించాలి – తహసిల్దార్ సురేఖ

Tahsildar” శంకరపట్నం | డిసీ ప్రతినిధి
కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో పౌరహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో తహసిల్దార్ కే. సురేఖ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కలలుగన్న కుల రహిత సమాజాన్ని నిర్మించడం ప్రతి పౌరుని బాధ్యత అని పేర్కొన్నారు.

కలెక్టర్ ఆదేశాలతో పౌరహక్కుల దినోత్సవం

మంగళవారం శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో, కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసిల్దార్ సురేఖ మాట్లాడుతూ:

“కుల-మతాలకు అతీతంగా సోదర భావంతో జీవిస్తూ, సమాజ శ్రేయస్సు కోసం పని చేయాలి. అంబేద్కర్ కలలు కులరహిత సమాజం ఏర్పడినప్పుడే సాకారం అవుతాయి” అని ఆమె తెలిపారు.

అంబేద్కర్ సేవలు ఆదర్శంగా నిలవాలి

ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకుడు దేవునూరి వెంకటేశ్వర్ చేత పంక్తి భోజనం చేయించడం గమనార్హమని, ఆయన సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయని సురేఖ ప్రశంసించారు.

అతిధులుగా పాల్గొన్నవారు:

  • ఎంపీడీవో కృష్ణ ప్రసాద్

  • ఎం.పి.ఓ కాసగొని ప్రభాకర్

  • మండల సూపరిండెంట్ రాఘవేందర్ రెడ్డి

  • గ్రామ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ మాధవరావు

  • వైద్యాధికారి గొట్టే శ్రవణ్ కుమార్

  • ఆర్‌ఐ ప్రత్యూష

  • ఎఎస్‌ఐ సుధాకర్

  • తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు అంతడుపుల సతీష్

  • మాజీ సర్పంచ్ కాటన్ వెంకట రమణారెడ్డి

  • మాజీ వైస్ ఎంపీపీ మోతే ఎల్లారెడ్డి

  • మాజీ ఉప సర్పంచ్ అడితం కుమార్

  • జిల్లా ఉపాధ్యక్షుడు బొజ్జ రవి

  • సీనియర్ నాయకులు కనకం శంకర్, దేవునూరి కిష్టయ్య, క్యాదాసి భాస్కర్

  • గ్రామస్తులు, సంఘాల ప్రతినిధులు తదితరులు.

  • Tahsildar” అంబేద్కర్ కలలుగన్న కుల రహిత సమాజాన్ని నిర్మించాలి – తహసిల్దార్ సురేఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *