Raja singh” హైదరాబాద్,
తెలంగాణ గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) చేసిన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా ఆమోదించారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్. రాంచందర్ రావును నియమించడాన్ని నిరసిస్తూ రాజా సింగ్ జూన్ 30న తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి పంపారు. పార్టీ తీర్మానాలపై తీవ్ర అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు.
“పార్టీని కిందస్థాయి కార్యకర్తలు నడుపుతున్నారు. కానీ, ఆ వర్గాన్ని పక్కన పెట్టి, కొంతమంది స్వార్థపరులు నిర్ణయాలను ప్రభావితం చేయడం బాధాకరం,” అని రాజా సింగ్ పేర్కొన్నారు.
పార్టీ నాయకత్వం రాజీనామాను స్వీకరించడంతో, రాజా సింగ్ ఇకపై బీజేపీలో ఉండడని స్పష్టం అయింది. అయితే, ఆయన హిందుత్వ సిద్ధాంతానికి విశ్వాసం ఉందని, రాజీనామా పార్టీకి మాత్రమేనని తెలిపారు.
