భారత్ పర్యాటకులు ఆరుగురు మృతి
బస్సు లోయలోపడి 7 గురు మృతి చెందిన ఘటన నేపాల్ దేశంలో గురువారం చోటు చేసుకుంది. అందులో ఆరుగురు భారత్ నుంచి వెళ్లిన పర్యాటకులు ఉన్నారు. భక్తులతో రాజస్థాన్ నుంచి వెళ్తున్న బస్సు భారత్ సరిహద్దు దాటి నేపాల్లోని మాధేవ్ ప్రావిన్స్లోని బారా జిల్లాలో సిమారా సబ్ మెట్రోపాలిటన్ సిటీ వద్ద చురియమై ఆలయానికి సమీపంలోని నదీతీరం వద్ద లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు భారతీయ పర్యాటకులు, ఓ నేపాల్ పౌరుడు మృతి చెందాడు. అందులో ఉన్న మరో 19 మంది గాయపడ్డట్టు నేపాల్ అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు 26 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరితో పాటు నేపాల్ కు చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. మృతి చెందిన వారి సమాచారం వారి బంధువులకు అందించామని పోలీస్ అధికారి ప్రదీప్ బహదూర్ ఛెత్రి తెలిపారు. బస్సు డ్రైవర్ జిలావిూ ఖాన్తో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు బారా జిల్లా పోలీస్ కార్యాలయ చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోబీంద్ర బోగటి చెప్పారు.
Check Also
OnePlus” వన్ ప్లస్ 13 స్మార్ట్ ఏఐ ఫోన్ 16GB RAM, 512GB స్టోరేజ్
OnePlus ” వనప్లస్ నుంచి భారీ ఫోన్ రిలీజ్ అయ్యింది. వివరాలు చూసుకున్నట్టయితే.. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ …