Population day” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని శంకరపట్నం మండల కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా “చిన్న కుటుంబం – చింతలేని కుటుంబం” అనే నినాదంతో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో లోకజ్ఞానం పెంచే ప్రయత్నం చేశారు.
ఈ కార్యక్రమానికి మండల వైద్యాధికారి డాక్టర్ గొట్టే శ్రావణ్ కుమార్ నాయకత్వం వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన సభలో మాట్లాడుతూ, “ఇద్దరు పిల్లలతో కూడిన చిన్న కుటుంబం ఆరోగ్యంగా, ఆర్థికంగా చింతలేని జీవితం సాగించగలదు” అని తెలిపారు. గ్రామాల్లో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో కుటుంబ నియంత్రణపై మంచి అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
