Chennai Train” చెన్నై:
చెన్నై–అరక్కోణం ప్రధాన రైల్వే మార్గంలో ఆదివారం తెల్లవారుజామున రైలు సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. తిరువల్లూరు సమీపంలోని ఎగత్తూర్ వద్ద ఒక బరువు గూడ్స్ రైలులో క్రూడ్ ఆయిల్ ట్యాంకర్కు మంటలు చెలరేగాయి.
ఈ గూడ్స్ రైలు 45 క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లతో చెన్నై ఎన్నోర్ నుంచి ముంబైకి వెళ్తుండగా, ఉదయం 5 గంటల సమయంలో ఒక్క ట్యాంకర్లో నక మంటలు మొదలయ్యాయి. ఆ మంటలు సమీపంలోని మరికొన్ని ట్యాంకర్లకు కూడా వ్యాపించడంతో పెద్ద స్థాయిలో దట్టమైన పొగలు ఎగసిపడ్డాయి.
రైల్వే అధికారులు వెంటనే స్పందించి, చెన్నై-అరక్కోణం మార్గంలోని రైలు రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు. అనేక ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు ఆలస్యం కావడమేకాక, కొన్ని మార్గాలు మార్చబడినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి.
గాయాలపై ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు లేకపోయినా, మంటలను పూర్తిగా అదుపు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో స్థితిగతులపై అంచనా వేయనున్నట్లు అధికారులు తెలిపారు. సీనియర్ రైల్వే అధికారులు, ఫైర్ సర్వీస్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటల అదుపుపై దృష్టి సారించారు.
ఈ ఘటనపై విషాదాన్ని వ్యక్తం చేసిన తిరువల్లూరు జిల్లా యంత్రాంగం, ప్రజలు ప్రమాద స్థలానికి సమీపించవద్దని, మంటల అదుపులో విఘాతం కలిగించవద్దని సూచించింది.
అంతేకాక, ఈ ప్రమాదానికి గల కారణాలను తేల్చేందుకు విచారణ ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
<
తమిళనాడులో క్రూడ్ ఆయిల్ రైలు అగ్నిప్రమాదం
తిరువల్లూరు సమీపంలో క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ల రైల్లో మంటలు.
చెన్నై నుంచి ముంబై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
భారీగా పొగ, మంటలు వ్యాపించాయి.. ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలు అర్పుతున్నారు. pic.twitter.com/NOzbMBXnae
— greatandhra (@greatandhranews) July 13, 2025
/p>
