Congress leaders” ఎమ్మెల్యే కవ్వంపల్లిని పరామర్శించిన కాంగ్రెస్ అగ్రనేతలు

Congress leaders” శంకరపట్నం, డిసీ ప్రతినిధి:

మానకొండూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు డా. కవ్వంపల్లి సత్యనారాయణను కాంగ్రెస్ అగ్రనేతలు ఆదివారం పరామర్శించారు. ఎమ్మెల్యే సత్యనారాయణ రెండో సోదరుడు కవ్వంపల్లి రాజేశం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన నేపథ్యంలో, ఆయన కుటుంబానికి పరామర్శ తెలియజేశారు.

కరీంనగర్ వాల్మీకి నగర్‌లోని కవ్వంపల్లి నివాసానికి వచ్చిన నేతలు, రాజేశం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

పరామర్శకు వచ్చిన ముఖ్యనేతలు:

  • మీనాక్షి నటరాజన్ – కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్

  • మహేష్ కుమార్ గౌడ్ – టీపీసీసీ అధ్యక్షుడు

  • పొన్నం ప్రభాకర్ గౌడ్ – రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

  • గడ్డం వివేక్ వెంకటస్వామి – గనులు, కార్మిక శాఖ మంత్రి

  • హర్కర వేణుగోపాల్ – రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు

  • భాను ప్రసాద్, మెన్నేని రోహిత్ రావు – ఎమ్మెల్సీలు

అంతకు ముందు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నల్గొండ ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కరీంనగర్ డిసిసి బ్యాంక్ అధ్యక్షుడు కొండూరి రవీందర్ రావు తదితరులు కూడా ఎమ్మెల్యేను పరామర్శించారు.

శుభారంభానికి శుభదీపం!
Silver డాన్సింగ్ గణేష్ దీపం – 5 వత్తుల హోల్డర్‌తో స్టాండ్付き ✨
ధార్మికత & అలంకరణకు అద్భుతమైన కలయిక

ప్యాకేజీలో: 1 గణేశుడు దీపం (మెటల్, సిల్వర్ ఫినిష్)
పూజా గది, టేబుల్ డెకర్, ఫెస్టివల్ డెకరేషన్‌కు బెస్ట్
వినాయక చవితి, దీపావళి, నవరాత్రులు – ప్రతి శుభకార్యానికీ సరైన దీపం
నెగెటివ్ ఎనర్జీని తొలగించు శక్తివంతమైన శోభాయమానమైన దీపం

ఇప్పుడు కేవలం ₹261/- (56% తగ్గింపు)
ఆర్డర్ చేయాలంటే https://amzn.to/4lMgCs7లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *