తెలుగు బిగ్బాస్ 7 సీజన్ రైతుబిడ్డను వరించింది. బిగ్బాస్ హౌజ్లో కి 13వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన పల్లె ప్రశాంత్ విజేతగా నిలిచి ట్యాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపించాడు. తెలుగు బిగ్బాస్లోనే కాకుండా దేశంలోనే ఒక సామాన్యుడు మొదటిసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి కోట్లాది మంది ఓట్లతో బిగ్బాస్ను మెప్పించాడు. 15 వారాలుగా కొనసాగిన ఈ పోటీలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడీ రైతుబిడ్డ. ఇందులో పల్లవి ప్రశాంత్, అమరదీప్ మధ్య పోటీ జరగగా ప్రశాంత్ స్వల్ప ఓటింగ్తో బిగ్బాగ్ టైటిల్ను నెగ్గాడు. పల్లవి ప్రశాంత్కు రూ. 35 లక్షలు ప్రైజ్మనీ, బ్రెజా కారుతో పాటు జోయలుక్కాస్ రూ. 15 లక్షల విలువ చేసేవి కూడా పొందాడు. ఈ పోటీలో అమరదీప్ రన్నర్గా నిలిచాడు. శివాజీ మూడు, నాలుగోస్థానంలో ఉన్న యావర్ రూ. 15 లక్షలు తీసుకుని బయటికి వచ్చాడు. ఇక ఐదో స్థానంలో ప్రియాంక నిలిచింది.
![](https://dctelugu.com/wp-content/uploads/2023/12/2-7-660x330.jpg)