Cricket Tournament” ✍️ శంకరపట్నం డిసి ప్రతినిధి | మానకొండూర్ నియోజకవర్గం వార్త
తిమ్మాపూర్ మండలం, ఎల్ఎండీ కాలనీ:
“ఉజ్వల భవిష్యత్తు కోసం చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. యువత సన్మార్గంలో సాగాలని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకుని జీవితాన్ని దిశానిర్దేశించుకోవాలి” అని శాతవాహన అర్బన్ అభివృద్ధి సంస్థ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా
సోమవారం నాడు తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీ క్రీడామైదానంలో జరిగిన మానకొండూర్ నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టాస్ వేయడం ద్వారా టోర్నీకి శ్రీకారం చుట్టారు.

యువతకు హెచ్చరిక – మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాలి
ఈ సందర్భంగా మాట్లాడుతూ,
“స్మార్ట్ఫోన్ అసక్తి, బెట్టింగ్, డ్రగ్స్ వంటి ప్రమాదకరమైన అలవాట్లకు యువత బానిసలవుతున్నారు. ఇది వారి భవిష్యత్తును నాశనం చేస్తుంది. ఇటువంటి మార్గాలను వదిలిపెట్టి, ఆరోగ్యవంతమైన జీవితానికి, అభివృద్ధికి దోహదపడే మార్గాన్ని ఎంచుకోవాలి,” అని సూచించారు.
క్రీడల ప్రాధాన్యం
క్రీడల వల్ల:
-
మానసిక ఆనందం
-
శారీరక దృఢత
-
సామూహిక చైతన్యం
లభిస్తాయని పేర్కొన్నారు.
“ఐపీఎల్ వంటి లీగ్స్ ద్వారా గ్రామీణ ప్రాంత యువత ప్రతిభ వెలుగులోకి వస్తోంది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లు ఇందుకు ఉదాహరణలు,” అని అన్నారు.
పాల్గొన్న నాయకులు & నిర్వాహకులు
ఈ కార్యక్రమంలో:
-
అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, మామిడి అనిల్ కుమార్
-
ద్యావ శ్రీనివాస్ రెడ్డి, గుర్రం వాసు, తాళ్లపల్లి శ్రీకాంత్, తుర్తి అరవింద్
-
ఎల్కపల్లి సిద్దార్థ్, ముక్కెర సతీష్ కుమార్, మహేశ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ క్రికెట్ టోర్నమెంట్లో 32 జట్లు పాల్గొంటున్నాయి.

