Jagityal news” జగిత్యాలలో పట్టపగలే దారుణం: బైపాస్ రోడ్డులో యువకుడి హ*త్య.”

Jagityal news”

జగిత్యాల, ఫిబ్రవరి 15: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఒక భయంకరమైన హత్య ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని దుండగులు కర్రలతో కొట్టి ప్రాణాలు తీశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

ఘటన వివరాలు:

పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన బోలె విశ్వనాథ్ (30) ఆదివారం శివరాత్రి సందర్భంగా పట్టణంలోని ఒక ఆలయానికి వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరిగి వెళ్తుండగా, సాయిబాబా గుడి సమీపంలోని బైపాస్ రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు అతనిని అడ్డుకున్నారు. నిందితులు వెంట తెచ్చుకున్న కర్రలు, మొద్దులతో విశ్వనాథ్ తలపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలైన విశ్వనాథ్ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

హత్యకు కారణం ఏంటి?

ప్రాథమిక విచారణలో ఈ హత్యకు కుటుంబ కలహాలు లేదా వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు:

సమాచారం అందుకున్న జగిత్యాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *