Malang shavali” మతసామరస్యానికి ప్రతీక మలంగ్ షావలి దర్గా ఉరుసు – హిందూ ముస్లింల భక్తిశ్రద్ధతో మొక్కుల చెల్లింపులు

Malang shavali” శంకరపట్నం, డిసీ ప్రతినిధి:

కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని మొలంగూర్ గ్రామంలో గల మలంగ్ షావలి దర్గా ఉరుసు మతసామరస్యానికి నిదర్శనంగా ఏటా ఘనంగా నిర్వహించబడుతుంది. దూద్ బావి, ఖిల్లా వద్ద ఉన్న ఈ దర్గాలో హిందూ ముస్లింలు సమానంగా పాల్గొని, తమ తమ మొక్కులు చెల్లించుకుంటారు.

మతాలకు అతీతంగా భక్తుల సందడి

ఈ ఉరుసు కార్యక్రమం మొహరం పండుగ ముగిసిన మరుసటి రోజు ఘనంగా ప్రారంభమవుతుంది.

  • మొదటి రోజు గంధం ప్రవేశం

  • రెండవ రోజు ఉరుసు జాతర
    పంపాదితంగా కొనసాగుతాయి.

హిందూ ముస్లింలు మాత్రమే కాదు, అన్ని కులాల మహిళలకు ప్రత్యేక ప్రవేశం ఉంటుంది – ఇది ఆనవాయితీగా కొనసాగుతున్న ఆనవాయితీ.

 వారు తమ మొక్కులను చెల్లించుకుంటూ, మలంగ్ షావలీ దర్గా వద్ద శాంతి, సమగ్రత కోసం ప్రార్థనలు చేస్తారు.

పోలీసు బందోబస్తు ఏర్పాటు

భక్తుల భద్రత దృష్ట్యా, కేశవపట్నం ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సమర్థవంతమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయబడింది. ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *