న్యూఢిల్లీ: దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైతులకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో అమలు చేస్తున్న పీఎం కిసాన్ (PM-Kisan) పథకం 22వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల మార్చి 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.
అసోం వేదికగా నిధుల పంపిణీ
అస్సాంలోని గువాహటి వేదికగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బటన్ నొక్కి పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

9.32 కోట్ల మంది రైతులకు లబ్ధి
ఈ విడతలో దేశవ్యాప్తంగా సుమారు 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,000 చొప్పున నేరుగా జమ కానున్నాయి. ఈ దఫా కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ. 19 వేల కోట్ల నిధులను కేటాయించింది. గతేడాది నవంబర్ 19న 21వ విడత నిధులు విడుదలైన సంగతి తెలిసిందే.
పథకం విశేషాలు:
-
ప్రారంభం: 2019లో మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
-
వార్షిక సాయం: ఏటా మూడు విడతల్లో రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 6,000 రైతుల ఖాతాల్లో వేస్తారు.
-
మొత్తం లబ్ధి: ఇప్పటివరకు 21 విడతల్లో అన్నదాతలకు రూ. 4 లక్షల కోట్లకు పైగా నిధులు అందించబడ్డాయి.
ఏపీలో ‘అన్నదాత సుఖీభవ’తో జతగా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే సమయంలో పీఎం కిసాన్ నిధులతో కలిపి ‘అన్నదాత సుఖీభవ’ నిధులను విడుదల చేస్తుండటంతో, రాష్ట్ర రైతన్నలకు రెట్టింపు ప్రయోజనం చేకూరనుంది.
ఈ ఎండాకాలంలో మంచి ఏసీ కొనాలనుకుంటున్నారా…
అయితే లింక్ పై క్లిక్ చేయండి https://amzn.to/4daqgE4 అమెజాన్లో అద్ముత ఆఫర్లు..
గ్యాస్ వినియోగదారులకు షాక్ : సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు.. కొత్త గడువు ఇదే!
T20 WC ఫైనల్: విశ్వవిజేతకు దక్కే ప్రైజ్ మనీ ఎంతంటే? భారత్-కివీస్ పోరుకు అంతా సిద్ధం!

