మంగళవారం నాడు బెంగూళురు కు పలు సంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి నీళ్ల గురించి వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం కావేరి నీళ్లను తమిళనాడుకు విడుదల చేశారు. నీటిని విడుల చేయడాన్ని కర్ణాటక ప్రజలు తప్పు పడుతున్నారు. 300 సంస్థలు బెంగూళురు బంద్కు పిలుపునిచ్చాయి. మరోవైపు మాండ్యా జిల్లాలో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. వీరితో పాటు మరికొన్ని సంఘాలు బందుకు పిలుపునిచ్చే యోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేత చంద్రూ మాట్లాడారు. తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చాలని టౌన్ హాల్ నుంచి మైసూర్ వరకు వెళ్తామన్నారు. ఆ తరువాత కర్ణాటక ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వవనున్నట్టు తెలిపారు. ఈ పరిణామాలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి , నీటిపారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్ మాట్లాడారు. ఈ ఆందోళనల్లో రాజకీయ కోణం ఉందన్నారు. తాము కర్ణాటక రైతుల ప్రయోజనాలు కాపాడుతామని చెప్పారు. ఆందోళనకు కారులు బంద్ కు పిలుపునివ్వవద్దని సూచించారు.
Check Also
Khammam News” ఖమ్మంలో ఘోరం..తడి చేతులతో ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. 9 ఏండ్ల బాలిక మృతి
Khammam News” ఖమ్మం జిల్లాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. తడిచేతులతో సెల్ ఫోన్కు చార్జింగ్ పెడుతూ తొమ్మిదేండ్ల బాలిక …
Wine shops” హైదరాబాద్లో వైన్ షాపులు బంద్
Wine shops” హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ జోన్, ఈస్ట్ జోన్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం …
Flood rescue Drone” వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే డ్రోన్… వీడియో
Flood rescue Drone” సాధారణంగా వర్షకాలం వరదలు రావడం సహజం. భారీ వర్షాలు పడ్డప్పుడు లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. …