Bjp” 2025 మోదీ పాలనకు 11 సంవత్సరాలు – ప్రజల అభివృద్ధిలో భాజపా పాలన  

 Bjp”  శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకుసాగుతున్నదని, ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు భారత్ వైపే ఉన్నదని బీజేపీ జిల్లా కార్యదర్శి నరసింహ రాజు పేర్కొన్నారు.

మంగళవారం శంకరపట్నం మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో బూత్ స్థాయి అధ్యక్షులు, కార్యదర్శుల కోసం ఏర్పాటు చేసిన మండలస్థాయి కార్యశాలలో ఆయన మాట్లాడారు. సమావేశానికి ముందు బీజేపీ జెండావిష్కరణ జరగింది.

నరసింహ రాజు చేసిన కీలక వ్యాఖ్యలు:

  • దేశ అభివృద్ధి కోసం మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించిందని చెప్పారు.

  • తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలపై ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

  • రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయానికి కార్యకర్తలు ఇప్పుడే సిద్ధమవ్వాలని సూచించారు.

  • ప్రతి బూత్‌లో 11 మొక్కలు నాటాలని సూచిస్తూ పర్యావరణ సంరక్షణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

పాల్గొన్న ప్రముఖులు:

  • మాడ వెంకట్ రెడ్డి – జిల్లా ప్రధాన కార్యదర్శి

  • దండు కొమురయ్య – రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు

  • ఇనుకొండ నగేశ్వర్ రెడ్డి – జిల్లా నాయకుడు

  • దొంగల రాములు, జంగ జైపాల్, దాసరపు నరేందర్, కొయ్యడ అశోక్ యాదవ్

  • రాసమల్ల శ్రీనివాస్, మందడి జగ్గారెడ్డి, గౌరవేణి శ్రీనివాస్

  • బొడిగె నరేష్, బిజిలి సారయ్య

  • అన్ని గ్రామాల బూత్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, శక్తికేంద్ర ఇంచార్జులు మరియు కార్యకర్తలు

ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తు రాజకీయ సమరానికి బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నట్టు స్పష్టమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *