పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. రెండు మూడు రోజుల్లో తెలంగాణాలోనే పెద్ద పండుగ అయిన బతుకమ్మకు షాపింగ్ తిరిగి ఇంటికి వస్తుండగా కారుబోల్తాపడింది. అందులో ఉన్న భార్యాభర్తలు మృతి చెందారు. విషాదకర ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దపూఱ్ గ్రామ శివారులో బుధవారం పొద్దున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోలక్ పల్లి గ్రామానికి చెందిన నారాయణ (60) ఆయన దేవమణి భార్య (57) బట్టలు కొనుక్కునేందుకు హైదరాబాద్ వెళ్లారు. షాపింగ్ అనంతరం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గడిపెద్దపూర్ గ్రామ శివారులోని నేషనల్ హైవేపై కారు బోల్తాపడింది. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
రెడిమెడి సిటీనే బెస్ట్.. రాజధానిగా విశాఖనే ఫిక్స్ .?
ఓట్ల పండుగలో నోట్ల జాతర.. రూ. 101 కోట్లు సీజ్
హోటళ్లకు రేటింగ్ ఇవ్వాలి.. 13 లక్షలు హాం ఫట్