ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కంటకపల్లి వద్ద ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పలాస ప్యాసింజర్ రైలును విశాఖపట్నం – రాయగడ వెళ్తున్న
రైలు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈఘటనలో 14 మంది మృతి చెందారు. మరో 40 మంది గాయపడ్డట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై చర్చ మొదలైంది. ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ బిశ్వజిత్ సాహు మాట్లాడారు. మానవ తప్పిదంతోనే ఈ యాక్సిడెంట్ చోటు చేసుకున్నట్టు తెలిపారు. లోకో పైలట్ రెడ్ సిగ్నల్ వద్ద రైలును ఆపకుండా ముందుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు చెప్పారు విచారణ తరువాత వాస్తవమైన వివరాల తెలుస్తాయని చెప్పారు. ఈ ఘటనలో రైలు లోకో పైలట్ కూడా మృతి చెందారన్నారు. ఈ ఘటనతో ఇప్పటి వరకు 18 రైళ్లను రద్దు చేశారు. ఇంకో 22 రైళ్లను దారి మళ్లించారు.
Check Also
Scooty Viral Video” లాంగ్ స్కూటీ.. కారులెక్క నలుగురు కూర్చోవచ్చు… వీడియో వైరల్
Scooty Viral Video” కుటుంబ సభ్యులు కానీ.. ఫ్రెండ్స్ కానీ ముగ్గురు నలుగురు ఒకే వాహనంలోపోవాలంటే కచ్చితంగా కారు కావాల్సిందే. …
Amazon Offers” ఇండోర్ మొక్కలపై 50 శాతం తగ్గింపు.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్లో..
Amazon Offers” ఇళ్లు లేదా ఆఫీస్ను అందంగా తీర్చిదిద్దుకోవాలన్నది అందరి కోరిక. చాలా మంది బోన్సాయి మొక్కలను పెంచుకుంటురు. అందుకోసమే …
Viral Video” కండ్లు చెదిరే రియల్ చేజింగ్.. సినిమాల్లో కాదు.. వీడియో వైరల్
Viral Video” ముందు విలన్ వెనకాలే హీరో చేజింగ్ నడుస్తుంటే కండ్లు పక్కకు తిప్పకుండా టెన్షన్ పడకుండా చూస్తాం. ఇదీ …