Arepally mohan” శంకరపట్నం, డిసి ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జై బాపు జై భీమ్ జై సమీధాన్ కార్యక్రమంలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశానికి కూడా తాను హాజరయ్యానని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి మజీబుల్లా షరీఫ్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
