బౌల‌ర్ల‌కు కొత్త రూల్.. లేట్ చేస్తే జ‌రిమానా.. అలా చేయించుకుంటే అన‌ర్హులు

2023 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ ముగిసింది. వ‌న్డే, టీ ట్వంటీ ఫార్మాట్ల‌లో వేగాన్ని పెంచేందుకు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ క‌మిటీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బౌల‌ర్ల‌కు కూడా టైమ్ అవుట్ నిబంధ‌న‌ను పెట్టింది. ఒక బౌల‌ర్ ఒక ఇన్నింగ్స్‌లో మూడో సారి కొత్త ఓవ‌ర్‌ను మొద‌లు పెట్టేందుకు 60 సెక‌న్ల‌కంటే ఎక్కువ స‌మ‌యం తీసుకుంటే జ‌రిమానా విధించ‌నుంది. ఇలా ఆల‌స్యం అయిన సంద‌ర్భంలో ఇక నుంచి బౌలింగ్ జ‌ట్టుకు 5 ప‌రుగులు జ‌రిమానా విధించాల‌ని నిర్ణ‌యించింది. ఈ విష‌యాన్ని ఐసీసీ మంగళ‌వారం వెల్ల‌డించింది. ఈ రూల్ ప్ర‌స్తుతానికి ట్ర‌య‌ల్‌గా మాత్ర‌మే అమ‌లు చేయ‌నున్నారు. దీని వ‌ల్ల ఉప‌యోగాలు, మ్యాచ్‌లో ఎదుర్కునే ఇబ్బందుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని త‌ర్వాత శాశ్వ‌తంగా అమ‌లు చేయున్నారు. డిసెంబ‌ర్ 2023 నుంచి 2024 ఏప్రిల్ వ‌ర‌కు పురుషుల ఓడీఐ, టీ ట్వంటీ క్రికెట్‌లో ప్ర‌యోగ‌త్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

అలా చేయించుకుంటే

ఒక క్రికెట్ ఆట‌గాడు మ‌గ‌వాడిగా పెరిగి, య‌వ్వ‌నంలో అత‌ని శ‌రీర‌లో ఆడ‌పిల్ల‌ల వృద్దిచెంది, అత‌డు లింగ మార్పిడి చేయించుకున్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల జ‌ట్టులో ఆడేందుకు అర్హుడు కాద‌ని పేర్కొంది.

భారత అభిమానులు క్షమించండి.. డేవిడ్‌ వార్నర్‌ ట్వీట్‌!

నిన్న‌టి రోజు మ‌న‌ది కాదు… డ్రెస్సింగ్ రూంలో క్రికెట‌ర్ల‌ను ఓదార్చిన మోడీ

విరాట్‌ను హ‌త్తుకుని ఓదార్చిన అనుష్క‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *