Independence Day” ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసిన అధికారులు…
శంకరపట్నం: డిసీ ప్రతినిధి:
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని అన్ని గ్రామాల్లో నువ్వు వందల జెండా రెపరెపలాడింది. కేశవపట్నం ఆల్ఫ్రెడ్ మొబైల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థుల ర్యాలీ చూపరులను ఆకట్టుకుంది . స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తాసిల్దార్ కార్యాలయంలో కే సురేఖ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్, కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో కట్కూరి శేఖర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యాలయం ఆవరణలో ఏఓ వెంకటేష్, ప్రాథమిక వైద్యశాలలో వైద్యాధికారి శ్రావణి, ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రత్యేక ఆయా శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రత్యేక అధికారులు, పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీల మండల శాఖ అధ్యక్షులు, ఆటో యూనియన్, హమాలి యూనియన్ అధ్యక్షులు బాధ్యులు జాతీయ జెండాల ఎగురవేసి పండగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య, వివిధ రాజకీయ పార్టీలు నాయకులు కార్యకర్తలు కార్మికులు కర్షకులు. అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



