Karimnagar Rain” జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ పమేలా సత్పతి గురువారం అధికారులకు సూచించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశమున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగా అప్రమత్తం చేయాలని ఆమె ఆదేశించారు.
ప్రధాన సూచనలు:
-
లోతట్టు ప్రాంతాల్లో తాత్కాలిక వసతి సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
-
నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తుడిచివేసి, నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
-
పాతబడ్డ, శిథిల గృహాల్లో నివసిస్తున్న వారిని అప్రమత్తం చేసి ఖాళీ చేయించాలన్నారు.
-
విద్యుత్ స్తంభాలు, లైన్ల చుట్టూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖను ఆదేశించారు.
-
రోడ్లపై ఏర్పడిన ప్రమాదకర గుంతలను వెంటనే పూడ్చాలని రోడ్లు భవనాల శాఖ అధికారులకు సూచించారు.
స్వచ్ఛత, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి:
వర్షాల అనంతరం వ్యాధుల వ్యాప్తి అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
అపదమిత్ర వాలంటీర్ల వినియోగం:
DRF (Disaster Response Force) బృందాలను మున్సిపల్ అధికారులు సిద్ధంగా ఉంచాలని, అవసరమైతే అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన అపదమిత్ర వాలంటీర్లను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో రెవిన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్తో పాటు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తల కోసం దీనిపై క్లిక్ చేయండి
karimnagar-railway” జమ్మికుంట-రైల్వే స్టేషన్ ను ‘‘అమృత్ భారత్’’లో చేరుస్తాం
