Mla kavvampalli Birthday” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
“ఊపిరి ఉన్నంత వరకూ ప్రజలకు సేవ చేస్తా. పదవులు శాశ్వతం కావొచ్చు కానీ ప్రజలతో ఉన్న అనుబంధమే శాశ్వతం” అని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తన జన్మదిన వేడుకలో స్పష్టం చేశారు.
మంగళవారం తిమ్మాపూర్ మండలం అల్గునూరులో ఉన్నతి కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన జన్మదిన కార్యక్రమంలో కవ్వంపల్లి దంపతులు కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ:
-
ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం పని చేస్తానన్నారు.
-
తాను చివరి క్షణంలో మంత్రిపదవిని పొందలేకపోయినప్పటికీ ప్రజల ప్రేమే తనకు శక్తి అన్నారు.
-
కాంగ్రెస్ క్యాడర్ను కాపాడుకోవడమే తన కర్తవ్యమని పేర్కొన్నారు.
️ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు:
బత్తిని శ్రీనివాస్ గౌడ్ (పీసీసీ సభ్యుడు)
“కవ్వంపల్లి సత్యనారాయణ గారు డాక్టర్గా, ఎమ్మెల్యేగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. పదవి కన్నా ప్రజల సేవే గొప్పది.”
ద్వావ శ్రీనివాస్ రెడ్డి (కిసాన్ కాంగ్రెస్)
డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికిమంత్రిపదవి రాకపోవడం బాధాకరమని, మంత్రిని చేసే బాధ్యత నియోజకవర్గ ప్రజలదేనన్నారు.
పాల్గొన్న ప్రముఖులు:
బ్లాక్ కాంగ్రెస్, మండల నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పలు గ్రామాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, యువజన నాయకులు – వందలాదిమంది పాల్గొన్నారు.
