Suryapeta crime” చుట్టపు చూపుగా వచ్చిన ముగ్గురు ఒకేసారి మృత్యు ఒడికి చేరారు. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. క్వారీ గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కు చెందిన శావల్య రాజు (45), ఈయన బిడ్డ, శ్రావల్య ఉష (12), శ్రీపాల్ రెడ్డి (40 )లు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం బొప్పారం గ్రామంలోని చుట్టాల ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో స్థానిక క్రషర్ గుంతల్లో ఈత కొట్టేందుకు వెళ్లినట్లు సమాచారం. చుట్టాల ఇంటికి వచ్చి ఒకేసారి ముగ్గురు మృతి చెందడంతో బొప్పారంలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
Adilabad Crime News” ఆదిలాబాద్లో దారుణం.. భార్య గొంతు కోసి చంపేసి.. భర్త కూడా ఆత్మహత్యాయత్నం
khammam crime news” భార్యాపిల్లను చంపి… ప్రమాదమని చిత్రీకరించి..
Viral Video”చుట్టుముట్టిన మొసళ్లు.. కొట్లాడి తప్పించుకున్న జీబ్రా.. వీడియో వైరల్