Bhoo Bharati” రైతు సమస్యలు తీర్చడమే లక్ష్యంగా… పరిశీలన
తాసిల్దార్ సురేఖ…
శంకరపట్నం డిసి ప్రతినిధి
భూభారతి దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేసినట్లు తహసిల్దార్ కే.సురేఖ శుక్రవారం తెలిపారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని కార్యాలయంలో తహసిల్దార్ కే సురేఖ భూ భారతి దరఖాస్తుల పరిశీలన చేపట్టారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ సురేఖ మాట్లాడారు. తెలంగాణలోని ప్రజా ప్రభుత్వము, రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం, ప్రవేశపెట్టిన భూభారతి చట్టాన్ని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అమలు చేస్తున్నట్టు తెలిపారు. మండల పరిధిలో గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతి రెవెన్యూ సదస్సులను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిర్వహించినట్టు చెప్పారు.
భూ సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా భూ భారతి దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేసినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది. తదితరులు ఉన్నారు.

వివరాల కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి
