రోజుకు సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. సాటుకు ఉండి వల విసిరి లక్షలు కొల్లగొడుతున్నారు. వీరి వలలో ముంబాయికి చెందిన రిటైర్డ్ ఆఫీసర్ చిక్కారు. ఏకంగా రూ. 2.37 లక్షల దోచుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబాయికి చెందిన విశ్రాంత నేవి అధికారి కల్నల్ ఆశిష్ చిట్నిస్కు సెప్టెంబర్ 8న గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశారు. ఆమె పేరు జ్యోతి అని పరిచయం చేసుకుంంది. ఓ జాతీయ బ్యాంకులో ఉద్యోగినని చెప్పింది. మీ లాకర్కు ఫీజు బకాయి ఉందని చెప్పింది. దీనికి గాను 6600 బ్యాంకుకు చెల్లించాలని బాధితుడిని వివరించింది. ఆ తరువాత కొన్ని వారాల తర్వాత ఆశిష్ బ్యాంకు ఖాతను చెక్ చేసుకోగా సెప్టెంబర్ 8, 15 రెండు సార్లు 2.37 లక్షలు ఖాళీ అయినట్టు గుర్తించాడు. ఖంగుతిన్న ఆశిష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![](https://dctelugu.com/wp-content/uploads/2023/10/2-10-660x330.jpg)