భార‌త్ భూ భాగంపై ఎగిరిన వింత వ‌స్తువు.. ఫ్ల‌యింగ్ సాస‌ర్‌..?

అమెరికా, కెన‌డా లాంటి విదేశాల్లో వింత వ‌స్తువులు ఎగిరిన‌ట్టు అప్ప‌డ‌ప్పుడు వార్త‌లు చూస్తుంటాం. అవి గ్ర‌హంత‌ర వాసుల ఫ్లయింగ్ సాస‌ర్లంటూ పుకార్లు కూడా షికారు చేస్తుంటాయి. కానీ ఏదో వింత వ‌స్తువు భార‌త భూభాగం పై ఎగ‌రడం క‌ల‌క‌లం రేపింది. మ‌ణిపూర్ రాష్ట్ర రాజ‌ధానిలోని ఎయిర్ పోర్టు స‌మీపంలో ఈ వింత వ‌స్తువు ద‌ర్శ‌నమిచ్చింది. స్థానికులు ఈ దృశ్యాల‌ను కెమెరాలో బంధించారు. విష‌యం తెలుసుకున్న భార‌త వైమానికి దళం రాఫెల్ యుద్ద‌విమానాలను మోహ‌రించింది. ఇది న‌వంబ‌ర్ 19 తారీఖున మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు చోటు చేసుకుంది. దీంతో ఆ ఎయిర్ పోర్టు నుంచి రాక‌పోక‌లు సాగించే విమానాల‌ను దారి మ‌ళ్లించారు. ఎగురుతున్న వ‌స్తువు తెల్ల‌గా ఉంద‌ని సాయంత్రం అయ్యేస‌రికి క‌నిపించ‌కుండా పోయిందని ఓ అధికారి చెప్పారు. ఇలా ఓ వింత వ‌స్తువు భార‌త్‌లో ఎగ‌రడం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

 

నిన్న‌టి రోజు మ‌న‌ది కాదు… డ్రెస్సింగ్ రూంలో క్రికెట‌ర్ల‌ను ఓదార్చిన మోడీ

విరాట్‌ను హ‌త్తుకుని ఓదార్చిన అనుష్క‌

ఆ గ్రామంలో పుట్టిన ప్ర‌తి ఆడ‌పాప‌కు రూ. ఐదు వేల ఆర్థిక సాయం రేండ్ల శ్రీ‌నివాస్ ఔదార్యం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *