Marriage cheating” తమిళనాడులో ఓ నిత్య పెండ్లి కూతురును పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ ఒకటి కాదు రెండు ఏకంగా 50 పెండ్లిళ్లు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు తిరుపూర్కు చెందిన ఓ యువకుడు పెండ్లి కోసం డేట్ ది తమిళ్ వే అనే వెబ్సైట్లో సంప్రదించాడు. దీంతో అందులో సంధ్య అనే అమ్మాయి ప్రొఫైల్ చూసి ఆమెను పెండ్లి చేసుకున్నాడు. మూడు నెలల తర్వాత ఆమె ప్రవర్తను మార్పు రావడంతో సంధ్య ఆధార్ కార్డు చెక్ చేశాడు. అందులో భర్త పేరు వేరే ఉండడంతో ఆమెను ఆ యువకుడు నిలదీశాడు. దీంతో సంధ్య చంపేస్తానని బెదించిందని ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంధ్యను విచారించారు. ఈ విచారణలో విస్తు పోయే నిజాలు వెల్లడయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 మందిని పెండ్లి చేసుకున్నట్టు తెలిసింది. మోస పోయిన వారిలో ఓ డీఎస్పి డీఎస్పీ, ఒక పోలీసు ఇన్స్పెక్టర్, మరో పోలీసు అధికారి, కరూర్లో ఒక ఫైనాన్స్ అధికారితో సహా 50 మందికి పైగా పెళ్లి చేసుకుందని తెలిసింది.
ఇవి కూడా చదవండి
Cyber crime” ఆ మోసాలపై అప్రమత్తంగా ఉండండి.. తెలంగాణ పోలీస్ ట్వీట్
Bihar Bridge” ఇది 12వది.. వరుసగా కూలుతున్న బ్రిడ్జిలు
Lonovala Bhusi Dam” కండ్ల ముందే నీళ్లలో కొట్టుకుపోయిన కుటుంబం.. వీడియో