Road accident” శంకరపట్నం, డిసి ప్రతినిధి:
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో రోడ్డుప్రమాదం జరిగింది. చెందిన మండలంలోని అర్కండ్ల గ్రామానికి చెందిన నేదురు భూమయ్య అనే వ్యక్తి తన ఎక్సెల్ బండి పై స్వగ్రామం వెళుతుండగా, మార్గమధ్యంలోని ఎల్లమ్మ గుడి వద్ద మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో భూమయ్యకు తీవ్ర గాయాలయ్యాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయనను సమీప ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఈ ఘటనపై కేశవపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు భాదితుడి కుటుంబ సభ్యుడు నేదురు పవన్ తెలిపారు.
