Friday , 18 October 2024
Breaking News

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు డివైడ‌ర్ ను ఢీ కొని ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. సూర్యాపేట జిల్లాలో కారు లారీ ఢీ కొట్టిన ఘ‌ట‌న‌లో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే… సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణం నోవోపాన్‌ సవిూపంలో జాతీయ రహదారి పై రోడ్ సోమ‌వారం తెల్ల‌వారు జామున జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రు విద్యార్థులు మృతి చెందారు. స్కూటీ పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు డివైడర్‌ను ఢీ కొట్టారు. ఆర్‌. భరత్‌ చందర్‌ (19) పి.నితిన్‌, (18) అక్కడిక్కడే మృతి చెందారు. ఎ.వంశీ (19) తీవ్రగాయ‌ప‌డ్డాడు. వంశీని చికిత్స నిమిత్తం హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. వీరు సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూలో చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సూర్యాపేట జిల్లాలో హైటెక్‌ బస్టాండ్‌ ఎదురుగా జాతీయ రహదారి వద్ద ముందుగా వెళ్తున్న లారీని అతివేగంగా వచ్చిన కారు వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాప‌డ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

పామును రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం.. వీడియో వైర‌ల్

600 కిలోల అయోధ్య రామాలయ గంట

టార్గెట్ లోక్ స‌భ‌… బండికి ప‌గ్గాలు అప్ప‌జెప్పుతారా..?

About Dc Telugu

Check Also

18.10.2024 D.C Telugau Cinema Edition

18.10.2004 D.C Telugau Morning Edition

Mee Seva” తెలంగాణా మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా చల్ల కృష్ణ నియామకం

Mee Seva” హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో నియామకం కరీంనగర్ అక్టోబర్ 17 తెలంగాణా రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com