Raithu Bharosa” మాట తప్పని మడమతిప్పని సీఎం రేవంత్ రెడ్డి… 7 రోజుల్లో 15 ఎకరాల వరకు రైతు భరోసా

Raithu Bharosa”శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి నిబద్ధతగా పనిచేస్తోందని టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం మరియు మంత్రులకు క్షీరాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, ప్రజల మనసు గెలుస్తున్నార‌ని అన్నారు.

రైతులకు 7 రోజుల్లోనే నిధులు:
రైతు భరోసా పథకం కింద కేవలం 7 రోజుల వ్యవధిలోనే 15 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు ఎకరాకు ₹12,000 చొప్పున నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం చర్యలు ప్రశంసనీయమని ఆయన వెల్లడించారు.

క్షీరాభిషేకంతో కృతజ్ఞత:
ఈ సందర్భంగా రైతులు సీఎం, ఎమ్మెల్యేల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ నేతృత్వంలో నిర్వహించారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు:

హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి

కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి గౌడ్

బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కవ్వ పద్మ

యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెపు అజయ్

మత్స్య గిరింద్ర స్వామి చైర్మన్ కోరం రాజిరెడ్డి

ఇతర గ్రామ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ పట్ల గల నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

 

 

Natural. Elegant. Organized.

✨ త్రీ-టియర్ వుడ్ స్పైస్ రాక్
స్పైస్ బాటిల్స్, జార్స్, & డిస్ప్లే షెల్ఫ్‌లకు
ప్యాంట్రీ క్యాబినెట్ లోనూ, కౌంటర్‌పైనూ స్టైలిష్ ఆర్గనైజేషన్
100% నేచురల్ వుడ్ ఫినిష్

మీ కిచెన్‌కు ఒక నేచురల్ టచ్ ఇవ్వండి!

స్టాక్ లో ఉంది | ఆర్డర్ చేయండి నేడు!

https://amzn.to/468GGcr లింక్‌పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *